డీపీవోగా పార్థసారథి బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2021-06-15T06:21:18+05:30 IST
జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
సిద్దిపేట టౌన్, జూన్ 14: జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో)గా పార్థసారథి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు సిద్దిపేటలో కలెక్టర్ వెంకట్రామారెడ్డికి మొక్కను అందజేసి మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా మిర్యాలగూడ డివిజనల్ పంచాయతీ అధికారిగా పని చేస్తున్న పార్థసారథికి ఇటీవలే ప్రభుత్వం డీపీవోగా పదోన్నతి కల్పించి, సిద్దిపేటలో పోస్టింగ్ ఇచ్చింది.