రాజ్యసభ ఎంపీగా పార్థసారధిరెడ్డి ప్రమాణస్వీకారం
ABN , First Publish Date - 2022-06-25T05:55:07+05:30 IST
జిల్లానుంచి రాజ్యసభకు ఎన్నికైన మరో సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనలో ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ నుంచి రా
ఖమ్మం, జూన24(ఆంధ్రజ్యోతిప్రతినిధి): జిల్లానుంచి రాజ్యసభకు ఎన్నికైన మరో సభ్యుడు బండి పార్థసారధిరెడ్డి ఢిల్లీలోని పార్లమెంట్ భవనలో ప్రమాణస్వీకారం చేశారు. టీఆర్ఎస్ నుంచి రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ఎన్నికకాగా ఇప్పటికే వద్దిరాజు రవిచంద్ర ప్రమాణస్వీకారం చేయడంతో శుక్రవారం కొత్తగా ఎన్నికైన జిల్లాకు చెందిన బండి పార్థసారధిరెడ్డి, దీవకొండ దామోదరరావు ప్రమాణస్వీకారం చేశారు. ఈకార్యక్రమానికి టీర్ఎస్ లోక్సభ పక్షనేత నామ నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హాజరై పార్థసారధిరెడ్డికి అభినందన తెలిపారు. రాజ్యసభ చైర్మన ఎం.వెంకయ్యనాయుడు సమక్షంలో జరిగిన ఈకార్యక్రమానికి పలువురు టీఆర్ఎస్ ఎంపీలు హాజరయ్యారు.