సామూహిక జాతీయ గీతాలాపనలో పాల్గొనాలి

ABN , First Publish Date - 2022-08-15T05:25:45+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకోని మంగళవారం నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు.

సామూహిక జాతీయ గీతాలాపనలో  పాల్గొనాలి
మాట్లాడుతున్న సీఐ రాజశేఖర్‌రాజు

-  కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు

కోరుట్ల, ఆగస్టు 14: స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకోని  మంగళవారం నిర్వహించే  సామూహిక జాతీయ గీతాలాపనలో  అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుట్ల సీఐ రాజశేఖర్‌ రాజు అన్నారు. పట్టణంలోని మున్సిపల్‌ సమావేశ మందిరంలో ఆదివారం మున్సిపల్‌ కమిషనర్‌ అయాజ్‌తో కలిసి పట్టణంలోని పలు పాఠశాల ఉపాధ్యాయులు, వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఐ మాట్లాడారు. పట్టణంలో మున్సిపల్‌, పోలీసు శాఖ అధ్వర్యంలో  మంగళవారం  ఉదయం 11:30 నిమిషాలకు నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనలో ప్రజలు భాగస్వామ్యులు అయ్యే విధంగా అవగాహన కల్పించాలని సూచిం చారు.  సమావేశంలో డీఈఈ అభినయ్‌, ఎస్‌ఐలు సతీష్‌, శ్యామ్‌ రాజు, మండల విద్యాదికారి నరేషం, మేనేజర్‌ శ్రీనివాస్‌, ఉపాధ్యాయులు తదిత రులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-15T05:25:45+05:30 IST