మొక్కల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించాలి
ABN , First Publish Date - 2021-03-04T05:19:50+05:30 IST
నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు.
-కలెక్టర్ రాహుల్రాజ్
వాంకిడి, మార్చి3: నర్సరీలలో మొక్కల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ రాహుల్రాజ్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని నవేధరి, సవ్వాతి గ్రామాల్లో ఆకస్మికంగా ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, శ్మశాన వాటికలను పరిశీ లించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లెప్రకృతివనాలు, స్మశానవాటికలను, సకాలంలో పూర్తి అయ్యేలా చూడాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ వెంకటేశ్వర్రెడ్డి ఉన్నారు.