పల్లె ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
ABN , First Publish Date - 2021-10-26T06:14:29+05:30 IST
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలకు సోమవారం మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాకవరపాలెం, గొలుగొండ పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్యామ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.
మాకవరపాలెం/ గొలుగొండ, అక్టోబరు 25 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని ఆశా కార్యకర్తలకు సోమవారం మొబైల్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాకవరపాలెం, గొలుగొండ పీహెచ్సీల వైద్యాధికారులు డాక్టర్ శ్రీవిద్య, డాక్టర్ శ్యామ్ మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజల ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. తద్వారా ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక దృష్టిసారించే అవకాశం ఉంటున్నారు. ప్రధానంగా పల్లెల్లో పరిసరాల పరిశుభ్రత, జ్వరాలు, కొవిడ్ వంటి వాటిపై అవగాహన కల్పించాలన్నారు. చిన్నపాటి అనారోగ్యం చేసినా సమీపంలోని వైద్యాలయాల్లో వైద్యసేవలు పొందేలా చూడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా పీహెచ్సీల సిబ్బంది పాల్గొన్నారు.