పరువు హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

ABN , First Publish Date - 2022-05-22T02:49:08+05:30 IST

షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి బేగంబజార్‌లో జరిగిన నీరజ్ పవార్ పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ శివారులో...

పరువు హత్య కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల అరెస్ట్

హైదరాబాద్: షాహీనాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధి బేగంబజార్‌లో జరిగిన నీరజ్ పవార్ పరువు హత్య కేసును పోలీసులు ఛేదించారు. హైదరాబాద్ శివారులో నిందితులను పట్టుకున్నారు. నీరజ్ హత్యలో ఆరుగురు నిందితులు ఉన్నట్లుగా గుర్తించారు. A1-అభినందన యాదవ్, A2-విజయ్ యాదవ్, A3-సంజయ్ జాదవ్, A4-రోహిత్ యాదవ్, A5-మహేష్ యాదవ్, A6-మైనర్ అబ్బాయిపై కేసు నమోదు చేశారు. మొత్తం ఆరుగురు నిందితుల్లో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఆరుగురిలో ఐదుగురు (నీరజ్ భార్య)కు చుట్టాలుగా ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు ముందుగా నీరజ్‌ను బండరాయితో మోదీ తర్వాత కత్తులతో దాడి చేశారని చెప్పారు. మద్యం సేవించిన అనంతరం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లుగా వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపర్చి కస్టడీలో తీసుకుంటామన్నారు. 


Updated Date - 2022-05-22T02:49:08+05:30 IST