కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు

ABN , First Publish Date - 2022-04-08T02:30:08+05:30 IST

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన పాట్ కమిన్స్ ఐపీఎల్‌లో

కమిన్స్ ఖాతాలో అరుదైన రికార్డు

పూణె: ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన పాట్ కమిన్స్ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన కేఎల్ రాహుల్ సరసన చేరాడు. మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న కమిన్స్ 56 పరుగులు సాధించాడు. 2018లో ఢిల్లీ కేపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇప్పుడు అన్నే బంతుల్లో ఫిఫ్టీ బాదిన కమిన్స్ అతడి సరసన చేరాడు. కమిన్స్ స్కోరులో 6 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.


పాకిస్థాన్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టులో కమిన్స్ సభ్యుడు కావడంతో ఐపీఎల్‌లో తొలి మూడు మ్యాచ్‌లను ఆడలేకపోయాడు. జట్టులో చేరాక ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ఆడిన తొలి మ్యాచ్‌లోనే కమిన్స్ దంచికొట్టాడు. అతడి దెబ్బకు విజయం దిగొచ్చింది. ముంబై ఇండియన్స్‌పై నెగ్గిన కోల్‌కతా మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.  

Updated Date - 2022-04-08T02:30:08+05:30 IST