పాతస్నేహితులను కలిపే వేదికగా క్రికెట్ టోర్నమెంట్
ABN , First Publish Date - 2021-03-07T04:20:25+05:30 IST
పాతస్నేహితులందరిని కలిపే వేదికగా సీనియర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిలుస్తుందని మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా, ఈవో కోవూరు జనార్దన్రెడ్డి అన్నారు.
చిల్లకూరు, మార్చి 6: పాతస్నేహితులందరిని కలిపే వేదికగా సీనియర్స్ క్రికెట్ టోర్నమెంట్ నిలుస్తుందని మత్స్యశాఖ ఏడీ చాంద్బాషా, ఈవో కోవూరు జనార్దన్రెడ్డి అన్నారు. శనివారం కలువకొండ గ్రామంలోని లక్ష్మీ నరసింహస్వామి క్రీడామైదానంలో సీనియర్స్ క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని సీనియర్ క్రికెటర్లందరు కలిసి 12 ఏళ్లుగా ఈ టోర్నమెంట్ను నిర్వహించడమే కాకుండా, కొంత నిధిని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మధు, రఘు, మోహన్, చేవూరు నాగరాజు, సన్నారెడ్డి సురేష్రెడ్డి, సుబ్రమణ్యం, మునిశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం అక్వాలెవెన్స్- సిలికాలెవెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాంటింగ్ చేసిన ఆక్వాలెవెన్స్ నిర్ణీత 12 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సిలికా లెవెన్స్ 11.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసి విజయం సాధించింది. మధ్యాహ్నం కోస్టల్ లెవెన్స్ - గ్రావెల్స్ లెవెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన కోస్టల్ లెవెన్స్ జట్టు నిర్ణీత 14 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన గ్రావెల్ లెవెన్స్ 14 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసి ఓటమిపాలైంది.