పాఠశాలల్లో కొవిడ్ భయం
ABN , First Publish Date - 2022-01-26T02:46:12+05:30 IST
కరోనా భయం విద్యార్థులను వెంటాడుతుంది. మండలంలోని గిలకపాడు, గుండవోలు గ్రామాల పాఠశాలల్లో టీచర్లు, విద్యా
స్కూలుకు విద్యార్థులు దూరం.. దూరం
రాపూరు, జనవరి 25: కరోనా భయం విద్యార్థులను వెంటాడుతుంది. మండలంలోని గిలకపాడు, గుండవోలు గ్రామాల పాఠశాలల్లో టీచర్లు, విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. గుండవోలు పాఠశాలలో సుమారు వందమంది విద్యార్థులు ఉండగా, మంగళవారం కేవలం 8మంది మాత్రమే హాజరయ్యారు. గిలకపాడు పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా, మంగళవారం ఐదుగురు మాత్రమే హాజరయ్యారు. ఇక్కడున్న ఇద్దరు ఉపాధ్యాయులకు కొవిడ్ రావడంతో వేపినాపి పాఠశాల టీచర్ను ఒకరిని ఇక్కడకు తాత్కాలిక డిప్యూటేషన్పై నియిమించారు. అయితే భయంలో పాఠశాలకు విద్యా ర్థులను పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. రెండు పాఠశాలల్లోనూ బ్లీచింగ్, క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టారు.