26న ఏయూలో మేధోహక్కుల దినోత్సవం
ABN , First Publish Date - 2021-04-24T04:48:22+05:30 IST
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధోహక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు.
ఏయూ క్యాంపస్, ఏప్రిల్ 23: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రపంచ మేధోహక్కుల దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేధోహక్కుల పరిరక్షణ, పేటెంట్లు సాధించడం వంటి అంశాలపై విద్యావంతులు అవగాహన పొందాలన్నారు.
ఈ దిశగా ఏయూలో నెలకొల్పిన ఐపీఆర్ చెయిర్ పనిచేస్తోందని ఆయన తెలిపారు. ఏయూ డీపీఐఐటీ-ఐపీఆర్ చెయిర్ ప్రొఫెసర్ హనుమంతు పురుషోత్తం మాట్లాడుతూ ఈనెల 26న వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని మేధోహక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో విభిన్న రంగాలకు చెందిన నిపుణులు ప్రసంగిస్తారని తెలిపారు.