దేశభక్తి అలవర్చుకోవాలి : ఆర్జేడీ
ABN , First Publish Date - 2022-08-14T05:14:01+05:30 IST
స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరిలో అణువణువునా దే శభక్తి అలవరుచుకోవాలని ఆర్జేడీ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నా రు.
కడప(ఎడ్యుకేషన్), ఆగస్టు 13: స్వాతంత్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రజలందరిలో అణువణువునా దే శభక్తి అలవరుచుకోవాలని ఆర్జేడీ ఎంవీ కృష్ణారెడ్డి పేర్కొన్నా రు. కడప నగరం ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో శనివా రం ఆజాదీకా అమృత్ మహోత్సవ్ నిర్వహించారు. విద్యార్థు లు అందరూ ముక్తకంఠంతో జాతీయ గీతాలపన చేశారు. రహదారి గుండా విద్యార్థులచే దేశభక్తిని పెంపొందించే నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నారాయణ, పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.