వజ్రోత్సవాల్లో దేశభక్తిని చాటాలి

ABN , First Publish Date - 2022-08-13T06:04:58+05:30 IST

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొని దేశ భక్తిని చాటాలని ఎమ్మెల్యే సంజయ్‌ కు మార్‌ పిలుపునిచ్చారు.

వజ్రోత్సవాల్లో దేశభక్తిని చాటాలి
జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

రాయికల్‌, ఆగస్టు 12 :  భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో ప్రజలు కుల మతాలకు అతీతంగా పాల్గొని దేశ భక్తిని చాటాలని ఎమ్మెల్యే సంజయ్‌ కు మార్‌ పిలుపునిచ్చారు. రాయికల్‌ పట్టణంలోని స్థానిక మసీదు వద్ద వ జ్రోత్సవాల సందర్బంగా ముస్లిం సోదరులకు జాతీయ జెండాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, కౌన్సిలర్లు శ్రీధర్‌, మహేష్‌ గౌడు, మహేందర్‌, హుస్సేన్‌, ఇంతియాజ్‌, బాబా, అనీల్‌, సత్యనారాయణ ఉన్నారు. అలాగే మూడవ వార్డు కౌన్సిలర్‌ మారంపెల్లి సాయికుమార్‌ ఆధ్వర్యంలో వజ్రోత్సవాలను పురస్కరించుకుని రూపొం దించిన వాల్‌ పోస్టర్‌ను ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారు. దేశభ క్తిని చాటే ఈలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మోర హన్మాండ్లు, కౌన్సిలర్లు శ్రీధర్‌ రెడ్డి ఉన్నారు.


Updated Date - 2022-08-13T06:04:58+05:30 IST