జగన్ చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలు: పట్టాభి
ABN , First Publish Date - 2021-06-21T23:57:34+05:30 IST
సీఎం జగన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలని తెలుగుదేశం సీనియర్ నేత పట్టాభి అన్నారు.
అమరావతి: సీఎం జగన్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, మాయమాటలని తెలుగుదేశం సీనియర్ నేత కొమ్మారెడ్డి పట్టాభి రామ్ అన్నారు. సోమవారం పట్టాభి మీడియాతో మాట్లాడుతూ.. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే 5 రోజుల్లో ఏపీలో..10 శాతం కూడా వ్యాక్సిన్ల పంపిణీ జరగలేదన్నారు. 74.15శాతం ప్రజలకు తొలివిడత వ్యాక్సినే ఇవ్వలేదని చెప్పారు. ఇదేనా జగన్ సాధించిన రికార్డు? అని ఎద్దేవా చేశారు. జగన్ డ్రామాలు ఎవరికి తెలియదని?పట్టాభి ప్రశ్నించారు.