చంద్రబాబు ఐదేళ్ల పనితీరు వల్లే రాష్ట్రానికి ర్యాంకులు: పట్టాభి

ABN , First Publish Date - 2020-11-30T01:42:17+05:30 IST

ఇండియా టుడే సర్వేలో రాష్ట్రానికి వచ్చిన ర్యాంకులు చంద్రబాబు పనితీరు కారణంగా వచ్చినవేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. జగన్ పనితీరు వల్లే వచ్చాయని ...

చంద్రబాబు ఐదేళ్ల పనితీరు వల్లే రాష్ట్రానికి ర్యాంకులు: పట్టాభి

విజయవాడ: ఇండియా టుడే సర్వేలో రాష్ట్రానికి వచ్చిన ర్యాంకులు చంద్రబాబు పనితీరు కారణంగా వచ్చినవేనని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. జగన్ పనితీరు వల్లే వచ్చాయని సాక్షి డబ్బాలు కొట్టుకుంటోందని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ వచ్చాక ఆర్థిక రంగం అస్తవ్యస్తమైందన్నారు. ఐదేళ్లలో తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేసిన ఘనత చంద్రబాబుకు దక్కిందని చెప్పారు. ఈ నిజాన్ని వైసీపీ ప్రభుత్వమే ఒప్పుకుందని తెలిపారు. ఏమీ సాధించకుండానే.. సాధించామని సొంత పత్రికల్లో రాసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. టూరిజంలో టాప్‌లో ఉన్న ఏపీ.. జగన్ వచ్చాక 17వ స్థానానికి చేరిందని పట్టాభి విమర్శించారు. 


Updated Date - 2020-11-30T01:42:17+05:30 IST