గృహ నిర్మాణాలలో YCP నేతలు రూ. కోట్లు స్వాహా చేస్తున్నారు: Pattabhiram

ABN , First Publish Date - 2022-06-15T17:41:48+05:30 IST

గృహనిర్మాణాలపై మంత్రి జోగిరమేష్ చెప్పేవి అవాస్తవాలని టీడీపీ నేత పట్టాభిరామ్ విమర్శించారు.

గృహ నిర్మాణాలలో YCP నేతలు రూ. కోట్లు స్వాహా చేస్తున్నారు: Pattabhiram

Amaravathi: ఏపీ (AP)లోని గృహనిర్మాణాలపై మంత్రి జోగిరమేష్ (Jogiramesh) చెప్పేవి అవాస్తవాలని టీడీపీ (TDP) అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (Pattabhiram) విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వాలతో పోలిస్తే.. వైసీపీ (YCP) పాలనలో గృహ నిర్మాణం అధ్వాన్నమని విమర్శించారు. గృహ నిర్మాణాలలో వైసీపీ నేతలు రూ. కోట్లు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. మూడేళ్లలో గృహ నిర్మాణానికి కేటాయించింది రూ.12,023 కోట్లు అయితే ఖర్చు చేసింది రూ.5,891 కోట్లని ఆరోపించారు. ప్రభుత్వం మాత్రం గృహ నిర్మాణాలకు రూ.50 వేల కోట్లు ఖర్చు చేశామని.. అసత్య ప్రకటనలు చేస్తోందని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు.

Updated Date - 2022-06-15T17:41:48+05:30 IST