సీఐ, ఎస్ఐల అరాచకం పెరిగిపోతుంది: పత్తిపాటి

ABN , First Publish Date - 2021-03-06T21:15:28+05:30 IST

చిలకలూరిపేటలో అర్బన్ సీఐ బిలాల్ ఉద్దీన్, ఎస్ఐ షఫీల అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఐ, ఎస్ఐల అరాచకం పెరిగిపోతుంది: పత్తిపాటి

గుంటూరు: చిలకలూరిపేటలో అర్బన్ సీఐ బిలాల్ ఉద్దీన్, ఎస్ఐ షఫీల అరాచకం రోజురోజుకూ పెరిగిపోతోందని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టాడని తెలుగుదేశం కార్యకర్త కోటిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యే చెప్పారని పిల్లి కోటిని అర్ధరాత్రి అక్రమంగా తీసుకువచ్చి స్టేషన్లో నిర్బంధించారని మండిపడ్డారు. తన భార్య గర్భిణీతో ఉందని చెప్పినా వినకుండా దళితుడైన పిల్లి కోటిని అర్ధరాత్రి తీసుకురావడంపై ఉన్నతాధికారులతో పాటు మానవ హక్కుల సంఘానికి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.


స్టేషన్‌లో సీఐ, ఎస్ఐలు  చేస్తున్న తప్పులు, అక్రమాలు కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యే ఏది చెబితే అది చేయడం పనిగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. తెలుగుదేశంలో ఉన్న దళితులను, బీసీలను పోలీసు స్టేషన్‌కు పిలిపించి మీకు రాజకీయాలు ఎందుకు అంటూ ప్రశ్నిస్తున్న సీఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.  సీఐ, ఎస్ఐలు చేస్తున్న అరాచకాలను, అక్రమాలను, దోచుకున్న బంగారం సొత్తును విచారిస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తారని పత్తిపాటి పుల్లారావు చెప్పారు.

Updated Date - 2021-03-06T21:15:28+05:30 IST