పట్టిసీమ నీరు విడుదల చేయాలి!
ABN , First Publish Date - 2022-06-22T10:13:36+05:30 IST
కృష్ణా డెల్టాకు ముందుగా సాగునీరు వదిలిన ప్రభుత్వం పట్టిసీమ నీటిని విడుదల చేయడంలో మౌనం వహించడం సరికాదు...
కృష్ణా డెల్టాకు ముందుగా సాగునీరు వదిలిన ప్రభుత్వం పట్టిసీమ నీటిని విడుదల చేయడంలో మౌనం వహించడం సరికాదు. కృష్ణా డెల్టా ఆయకట్టులో లేని గన్నవరం, మైలవరం, దెందులూరు నియోజకవర్గాలలోని కొన్ని గ్రామాల భూములకు పట్టిసీమ నీరే దిక్కు. ఇప్పుడు వర్షాలు కూడా ఆశాజనకంగా లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మరింత ఆలస్యం చేయకుండా పట్టిసీమ నీటిని విడుదల చేయాలి. ప్రజాప్రతినిధులు చొరవ చూపి, నీరు విడుదల చేయించి రైతులను ఆదుకోవాలి.
జి. రామకృష్ణ, ముస్తాబాద