ప్రజలంతా సంయమనం పాటించాలి: Pavan Kalyan
ABN , First Publish Date - 2022-05-25T00:53:45+05:30 IST
అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ప్రజలంతా
Amaravathi: అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులంతా ముక్త కంఠంతో ఖండించాలని జనసేన (Janasena) పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కోరారు. ప్రజలంతా సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు అందరూ సహకరించాలని కోరారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ పేరును వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం దురదృష్టకరమన్నారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పాలక వర్గం విఫలమైందని ఆరోపించారు. పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి లేని సమస్యలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లావాసులకే కాదు.. రాష్ట్రానికంతా తెలుసునని అన్నారు. బాధ్యత గల పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి జనసేన పేరు ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నానని చెప్పారు.