పవన్కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటాం
ABN , First Publish Date - 2020-12-04T03:50:46+05:30 IST
జనసేన అధినేత పవన్కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ నాయకుడు సునీల్ తెలిపారు.
గూడూరు(రూరల్), డిసెంబరు 3: జనసేన అధినేత పవన్కళ్యాణ్ పర్యటనను అడ్డుకుంటామని ఏఐవైఎఫ్ నాయకుడు సునీల్ తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లును వెనక్కి తీసుకునేలా పవన్కళ్యాణ్ ఒప్పించాలన్నారు. ఢిల్లీలో రైతులు దీక్షలు చేస్తుంటే, , పవన్కళ్యాణ్ రైతుల పక్షాన పర్యటన చేయడం సరికాదన్నారు. కార్యక్రమంలో వంశీ, విష్ణు, రమణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.