పవన్‌ కల్యాణ్‌ కోలుకోవాలని ఆంజనేయస్వామికి ఆకుపూజ

ABN , First Publish Date - 2021-04-18T05:45:05+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ కోలుకోవాలని ఆంజనేయస్వామికి ఆకుపూజ

పవన్‌ కల్యాణ్‌ కోలుకోవాలని ఆంజనేయస్వామికి ఆకుపూజ
ఆంజనేయస్వామికి పూజలు చేయిస్తున్న పవన్‌ కల్యాణ్‌ అభిమానులు

జగ్గయ్యపేట, ఏప్రిల్‌ 17: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కొవిడ్‌ నుంచి సత్వరమే కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని కాంక్షిస్తూ పార్టీ కార్యకర్తలు, అభిమానులు శనివారం పట్టణంలో చెరువుకట్ట మీద ఉన్న ప్రసన్నాంజనేయస్వామికి ఆకుపూజ చేశారు. 

 నందిగామ రూరల్‌:  పవన్‌ కల్యాణ్‌ కరోనా నుంచి కోలుకోవాలని కౌన్సిల్‌ సభ్యుడు తాటి వెంకట కృష్ణ ఆకాంక్షించారు. అనాసాగరంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హనుమంతరావు, బ్రహ్మం, వేణు, సృజన, మాధవి, ఆదిలక్ష్మి పాల్గొన్నారు. 



Updated Date - 2021-04-18T05:45:05+05:30 IST