రైతుల పట్ల పవన్‌ మొసలి కన్నీరు: కాకాని

ABN , First Publish Date - 2022-06-09T03:07:26+05:30 IST

రైతుల పట్ల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి విమర్శించారు.

రైతుల పట్ల పవన్‌ మొసలి కన్నీరు: కాకాని

తిరుపతి: రైతుల పట్ల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ మొసలి కన్నీరు కారుస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన రెడ్డి విమర్శించారు. బుధవారం తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాము పది రకాల పంటలను చూపిస్తామని, వాటిలో ఐదు రకాల పంటల పేర్లు పవన్‌ చెబితే చాలన్నారు. అవగాహన లేని వ్యక్తులు కూడా వ్యవసాయం గురించి, రైతుల కష్టాల గురించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నట్టు చెప్పారు.సార్వత్రిక ఎన్నికల్లో కూడా సింగిల్‌గానే పోటీ చేసి 175 సీట్లను గెలుస్తామని గోవర్ధన రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-09T03:07:26+05:30 IST