సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : పవన్‌ కల్యాణ్‌

ABN , First Publish Date - 2021-01-24T22:02:43+05:30 IST

దివీస్ కర్మాగారం పరిసర గ్రామాల సమస్యలను సీఎం పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు.

సీఎం జగన్‌కు కృతజ్ఞతలు : పవన్‌ కల్యాణ్‌

అమరావతి: దివీస్ కర్మాగారంతో పరిసర గ్రామాల్లోని గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారని.. వారి సమస్యలను సీఎం జగన్ వెంటనే పరిష్కరించాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ డిమాండ్ చేశారు. ఆదివారం పవన్‌ మీడియాతో మాట్లాడుతూ.. దివీస్ నిరసనకారులను ప్రభుత్వం విడుదల చేయడం సంతోషం కలిగించిందన్నారు. ఈ సందర్భంగా  హైకోర్టు, సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. దివీస్ కర్మాగారం విడుదల చేసే కాలుష్యంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారన్నారు. 36 మందిని అరెస్టు చేసి జైలులో పెట్టడంతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయన్నారు. బెయిలు రావడానికి సహకరించిన అందరికీ  జనసేన తరపున కృతజ్ఞతలు చెప్పారు. ఇదే విజ్ఞతతో వారిపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని  పవన్‌ కల్యాణ్‌  డిమాండ్ చేశారు.

Updated Date - 2021-01-24T22:02:43+05:30 IST