AP News: భారత సైనిక వీరుల త్యాగఫలం కార్గిల్ విజయ్ దివస్: పవన్

ABN , First Publish Date - 2022-07-26T21:43:21+05:30 IST

భారత సైనిక వీరుల త్యాగఫలమే కార్గిల్ విజయ్ దివస్ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

AP News: భారత సైనిక వీరుల త్యాగఫలం కార్గిల్ విజయ్ దివస్: పవన్

అమరావతి (Amaravathi): భారత సైనిక వీరుల త్యాగఫలమే కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Divas) అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ 1999 జులై 26న భారత సైనికులు శత్రుమూకలను తరిమికొట్టి కార్గిల్ కొండలపై మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసిన చారిత్రాత్మక శుభదినమని అన్నారు. భారత సైనికుల ధైర్య సాహసాలు, వీరోచిత పోరాటాలు చూసి ప్రపంచం (World) అచ్చెరువొందిన రోజని అన్నారు.


ఈ విజయ సాధనలో 527 మంది సైనికులు వీర మరణం పొందడం గుండెలను పిండేసే వాస్తవమని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ పోరాటంలో ప్రాణాలను అర్పించిన భారత సైనికులకు శిరస్సు వంచి వందనం చేస్తున్నానని, వారి ధీరత్వానికి జోహార్లు అర్పిస్తున్నానన్నారు. శత్రువులను తరిమివేయడానికి భారత సైనికులు (Indian soldiers) చూపిన తెగువ, పోరాటం గురించి ప్రతి ఒక్కరం తెలుసుకోవాలన్నారు. మన దేశ భూభాగాన్ని రక్షించిన వారి త్యాగం ఎంత కీర్తించినా, మరెంత పొగిడినా తక్కువేనన్నారు. ఈ విజయ భేరిలో నినదించిన ప్రతి సైనికునికి, వారి కుటుంబాలకు భారత జాతి సర్వదా రుణపడి ఉంటుందని, అమరుల త్యాగాలను స్మరించుకుంటూనే ఉంటుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-07-26T21:43:21+05:30 IST