త్వరలో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం: పవన్
ABN , First Publish Date - 2021-03-07T01:47:16+05:30 IST
కుటిల రాజకీయాలు చేసిన వాళ్లు.. మట్టిలో కలిసిపోవడం ప్రపంచం కళ్లారా చూసిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు.
విజయవాడ : కుటిల రాజకీయాలు చేసిన వాళ్లు.. మట్టిలో కలిసిపోవడం ప్రపంచం కళ్లారా చూసిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ వ్యాఖ్యానించారు. శనివారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. హిట్లర్లాంటి ఉన్మాదులను చూసిన ప్రపంచం ఇది అని చెప్పారు. హిట్లర్లాంటి ఉన్మాదులు మట్టికరుచుకుపోయారు మీరెంత? అని ప్రశ్నించారు. ఎదిరించేవారు లేకపోతే వైసీపీ దాష్టీకానికి అంతుండదని చెప్పారు. వైసీపీని ఇలాగే వదిలేస్తే ఇంకా పేట్రేగిపోతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన, బీజేపీ ఆలోచన విధానంతో త్వరలో ప్రభుత్వాన్ని స్థాపిస్తామని స్పష్టం చేశారు. మీరు బెదిరిస్తే బెదిరిపోయే వాళ్లం కాదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.