నేడు నంద్యాలలో Pawan Kalyan పర్యటన

ABN , First Publish Date - 2022-05-08T13:11:05+05:30 IST

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాలలో పర్యటించనున్నారు. శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో

నేడు నంద్యాలలో Pawan Kalyan పర్యటన

నంద్యాల : నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నంద్యాలలో పర్యటించనున్నారు. శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పవన్ పాల్గొననున్నారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. శిరివెళ్ళ మండలంలో ఆత్మహత్య చేసుకున్న 130 మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేయనున్నారు. పవన్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.

Read more