AP News: వైసీపీ సర్కార్లో భయం మొదలైంది: పవన్ కల్యాణ్
ABN , First Publish Date - 2022-09-03T21:30:14+05:30 IST
వైసీపీ సర్కార్లో భయం మొదలైందని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు.
అమరావతి: వైసీపీ సర్కార్లో భయం మొదలైందని జనసేన అధినేత పవన్కల్యాణ్ (Pawan Kalyan) హెచ్చరించారు. విజయవాడ, జగ్గయ్యపేటలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణను.. వైసీపీ (YCP) అడ్డుకోవడం వారిలోని ఓటమి భయాన్ని చెబుతోందన్నారు. జనసేన (Janasena) జెండా దిమ్మెను కూల్చినవారిపై కేసులు పెట్టలేదని, ప్రశ్నించినవారిపై మాత్రమే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఇది ఎంతవరకు న్యాయమే పోలీసులు ఆలోచించాలని హితవుపలికారు. వైసీపీ జెండా దిమ్మెలు, విగ్రహాలకు అనుమతులు ఉన్నాయా? అని పవన్ ప్రశ్నించారు. అనుమతులు లేకపోతే వాటిని తొలగిస్తారా అని నిలదీశారు. జనసేన ఉనికిని తీసిపారేయడం ఎవరితరం కాదని హెచ్చరించారు. ప్రజలే జనసేన పార్టీని కాపాడుకుంటారని తెలిపారు. శాంతి భద్రతలకు ఇబ్బంది రాకూడదనే తాను రాలేదని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రోడ్డెక్కడం తప్పదని పవన్కల్యాణ్ హెచ్చరించారు.