‘జర భద్రం’ అంటూ వినూత్నరీతిలో పవన్ ట్విట్
ABN , First Publish Date - 2022-06-08T23:48:52+05:30 IST
‘జర భద్రం’ అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ వినూత్నరీతిలో ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘అప్పటివరకు మనల్ని తిట్టిన నేతలు సడెన్గా పొగుడుతారు.
అమరావతి: ‘జర భద్రం’ అంటూ జనసేన అధినేత పవన్కల్యాణ్ వినూత్నరీతిలో ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘‘అప్పటివరకు మనల్ని తిట్టిన నేతలు సడెన్గా పొగుడుతారు. పొగడ్తలను చూసి ఆ నేత మారిపోయాడని భావించి.. మనం చప్పట్లు కొడితే ప్రత్యర్థుల లక్ష్యం నెరవేరినట్లే. తిట్టిన నేతలు ఇప్పుడెందుకు పొగుడుతున్నారని ఆలోచించాలి. పొగుడుతున్నాడని ఆ నేతని ఆకాశానికి ఎత్తకండి. అది మైండ్ గేమ్లో భాగమే అని గుర్తించండి’’ అని పవన్ ట్వీట్లో సూచించారు.