AP News: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-08-31T01:34:10+05:30 IST

అమరావతి : జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితిని తొమ్మిది రోజుల అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ పండుగ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

AP News: రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

అమరావతి : జనసేన (Janasena) పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయక చవితిని తొమ్మిది రోజుల అంగరంగ వైభవంగా జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. అందరూ కలిసిమెలిసి జరుపుకునే ఈ పండుగ దేశ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు.

‘‘దేశ ప్రజలకు, ముఖ్యంగా తెలుగువారందరికీ నా పక్షాన, జనసేన పక్షాన భక్తిపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగలో మట్టి వినాయకులనే పూజించాలని నా మనవి. దీనివల్ల సంప్రదాయాన్ని పాటించినవారమవుతాం. దానితోపాటే పర్యావరణానికి మేలు చేసిన వారమూ అవుతాం. ప్రజలందరికీ శుభాలు కలుగచేయాలని, పాలన మాటున ప్రజలను పీడించే నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించాలని ఆ విఘ్నాధిపతిని మనసారా ప్రార్ధిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-31T01:34:10+05:30 IST