అంగన్వాడీలకు బకాయిలను చెల్లించండి: ఆచంట సునీత
ABN , First Publish Date - 2022-05-01T00:28:02+05:30 IST
రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం
విశాఖపట్నం: రాష్ట్రంలోని అంగన్వాడీలకు వెంటనే బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో సరైన పౌష్టికాహారం ఇవ్వడం లేదని సునీత అన్నారు. పాదయాత్రలో అంగన్ వాడీలకు ఇచ్చిన హామీలను సీఎం జగన్ అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్కి బకాయి పడ్డ 3 నెలల వేతనాలు తక్షణమే చెల్లించాలన్నారు. అలాగే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలన్నారు.