పెన్షనర్ల డీఏ బకాయిలు వెంటనే చెల్లించండి

ABN , First Publish Date - 2022-09-25T05:15:06+05:30 IST

పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల అరియర్స్‌, ఈ ఏడాది జన వరి నుంచి రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని పీలేరు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

పెన్షనర్ల డీఏ బకాయిలు వెంటనే చెల్లించండి
మాట్లాడుతున్న పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రారెడ్డి

పీలేరు, సెప్టెంబరు 24: పెండింగ్‌లో ఉన్న పెన్షనర్ల అరియర్స్‌, ఈ ఏడాది జన వరి నుంచి రావాల్సిన డీఏ బకాయిలను వెంటనే చెల్లించాలని పీలేరు పెన్షనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పీలేరు లోని ఆర్యవైశ్య కళ్యాణమండపంలో శనివా రం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ పెన్షనర్ల సంఘం పీలేరు శాఖ నూతన కార్యవర్గ పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకు అందాల్సిన బకాయిల గురించి ప్రశ్నించడానికి కూడా ప్రభుత్వం అవకాశంలేకుండా అణిచివేసేందుకు ప్రయత్నించడం దారుణమన్నారు.  కార్యక్రమంలో సంఘ సభ్యులు రామచంద్రయ్య, నరసింహారెడ్డి, సీతారామయ్య, ఆంజ నేయులు, కృష్ణయ్య, రాజారెడ్డి, కేవీనాయుడు, నారాయణ రెడ్డి, రమణారెడ్డి, గులంషా, బసిరెడ్డి, రాజశేఖరరెడ్డి, నిర్మల, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T05:15:06+05:30 IST