ఉపాధి బిల్లులు చెల్లించండి

ABN , First Publish Date - 2021-08-03T05:03:50+05:30 IST

ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ శ్రేణులతో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఈవోపీఆర్‌డీ భానోజీరావుకు వినతిపత్రం అందించారు.

ఉపాధి బిల్లులు చెల్లించండి
ధర్నా చేస్తున్న సువ్వాడ వనజాక్షి, టీడీపీ నాయకులు

టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి

ఎంపీడీవో కార్యాలయం వద్ద ధర్నా 

నెల్లిమర్ల, ఆగస్టు 2:  ఉపాధి హామీ పనుల పెండింగ్‌ బిల్లులను వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు సువ్వాడ వనజాక్షి డిమాండ్‌ చేశారు. నెల్లిమర్ల నియోజకవర్గ పార్టీ శ్రేణులతో మండల పరిషత్‌ కార్యాలయం వద్ద సోమవారం భారీ ధర్నా చేపట్టారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఈవోపీఆర్‌డీ భానోజీరావుకు వినతిపత్రం అందించారు. అంతకుముందు ధర్నాలో ఆమె మాట్లాడుతూ కోర్టు ఆదేశాలకు అనుగుణంగా వెంటనే ఉపాధి హామీ పెండింగ్‌ బిల్లులను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి పనుల పెండింగ్‌ బిల్లుల విషయంలో వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ప్రవర్తిస్తోందని విమర్శించారు. బిల్లులు అందక, తెచ్చిన రుణాలకు వడ్డీలు చెల్లించలేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్రంలో పరిపాలన ఏవిధంగా జరుగుతోందో ప్రజలు గమనిస్తున్నారని, ప్రజా సమస్యలను పక్కనపెట్టి పార్టీ అభివృద్ధికే పని చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు సువ్వాడ రవిశేఖర్‌, రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు, పార్టీ నాయకులు పతివాడ తమ్మినాయుడు, మహంతి చిన్నంనాయుడు, గేదెల రాజారావు, లెంక అప్పలనాయుడు, పతివాడ అప్పలనారాయణ, కర్రోతు సత్యనారాయణ, ఆకిరి ప్రసాద్‌, నాలుగు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2021-08-03T05:03:50+05:30 IST