విశ్వేశ్వర్రెడ్డిపై పయ్యావుల కేశవ్ ఫైర్
ABN , First Publish Date - 2022-04-26T01:47:26+05:30 IST
మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిపై పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం: మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డిపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రజల కోసం ఎవరినైనా ఎదురిస్తా.. బెదిరిస్తా. ప్రజల మధ్య విషం చిమ్ముతూ చిచ్చుపెడుతున్నావు. సంస్కారం లేకుండా మాట్లాడితే భాష మార్చాల్సి వస్తుంది. భూ పంపకాల్లో వచ్చిన వివాదాలతో మీ తండ్రి హత్య జరిగింది.మీ తండ్రి మరణంలో మా పాత్ర ఉంటే మాపై ఎందుకు ఫిర్యాదు చేయలేదు? వంచనకు కేరాఫ్ అడ్రస్ విశ్వేశ్వర్రెడ్డి’’ అని పయ్యావుల కేశవ్ విశ్వేశ్వర్రెడ్డిపై ధ్వజమెత్తారు.