Payyavula: ఉద్దేశ్యపూర్వకంగానే సీఎం జగన్ అబద్దాలు...

ABN , First Publish Date - 2022-09-18T17:46:54+05:30 IST

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ ఏదేదో లెక్కలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ విమర్శించారు.

Payyavula: ఉద్దేశ్యపూర్వకంగానే సీఎం జగన్ అబద్దాలు...

అమరావతి (Amaravathi): టీడీపీ (TDP) ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి గెంటేసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం జగన్ (CM Jagan) ఏదేదో లెక్కలు చెప్పారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తన ప్రభుత్వం గురించి తానే అబద్దాలు చెప్పిన ఏకైక సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. అధికారులిచ్చిన తప్పుడు లెక్కలను సీఎం చెప్పలేదని.. ఉద్దేశ్యపూర్వకంగానే అబద్దాలు చెప్పారని ఆరోపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం పెట్టాలని గతంలో డిమాండ్ చేశామన్నారు. ఇప్పుడూ అడుగుతున్నామని అన్నారు. ఆర్థిక పరిస్థితి బాగుంటే ఉద్యోగుల జీతాలు ఆలస్యం ఎందుకవుతున్నాయని ప్రశ్నించారు.  రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో రిటైర్డ్ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు. ఉద్యోగులు చనిపోతే కర్మకాండలకిచ్చే నిధులను కూడా మళ్లించారన్నారు. ఆర్థిక వ్యవస్థ సరిగా లేని కారణంగానే బిల్లులు చెల్లించలేక మందుల సరఫరా, చిన్న పిల్లలకిచ్చే చిక్కీలు.. పాలను కూడా ప్రభుత్వం ఆపేసిందని విమర్శించారు. నిరుపేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వచ్చిన నిధులను మళ్లించింది నిజం కాదా..? అన్నారు. పేదలకు ఇళ్లు రాకున్నా.. వారు మాత్రం ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ నిధులను మళ్లించారని, కొన్ని పథకాల అమలుకు డబ్బుల్లేవని కోర్టుల్లో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది నిజం కాదా..? అని ప్రశ్నించారు. ఈ విషయాలపై సభలో చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షానికి సమయం కేటాయించాలని,  స్పీకర్ ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ద హౌస్ అనే విషయాన్ని తమ్మినేని గుర్తించాలన్నారు. పుల్ దెమ్ అవుట్ అంటూ తమ్మినేని ఎలా అంటారని పయ్యావుల కేశవ్ నిలదీశారు.

Updated Date - 2022-09-18T17:46:54+05:30 IST