Payyavula Keshav: ఏ ఒక్కరినీ వదిలి పెట్టం..
ABN , First Publish Date - 2022-08-25T20:34:47+05:30 IST
వైసీపీ శ్రేణులు కుప్పంలో అన్న క్యాంటీన్ ధ్వంసం చేయడం దుర్మార్గమని పయ్యావుల కేశవ్ అన్నారు.
అనంతపురం (Anantapuram): వైసీపీ (YCP) శ్రేణులు కుప్పంలో అన్న క్యాంటీన్ (Anna canteen) ధ్వంసం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్త రక్తం చూసిన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని హెచ్చరించారు. కుప్పంలో వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకునే కుట్రలు సిగ్గుచేటన్నారు. అసలు జగన్ రెడ్డి (Jagan reddy)కి సిగ్గుందా? అని ప్రశ్నించారు. పేదల కడుపు నింపే అన్న క్యాంటీన్ కూలుస్తారా?.. టీడీపీ కార్యకర్తపై చెయ్యి ఎత్తిన ఏ ఒక్కడినీ వదిలేది లేదని మరోసారి స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్త వంటి నుంచి కారిన ప్రతి రక్తపు చుక్కా రేపు చురకత్తి కాబోతోందని, వచ్చే ఎన్నికల తర్వాత జగన్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తామని పయ్యావుల కేశవ్ అన్నారు.