Hyderabad: అవినీతి మరక లేని వ్యక్తి జైపాల్‌రెడ్డి : రేవంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-07-28T17:51:06+05:30 IST

తెలంగాణ వైతాళికుడు జైపాల్ రెడ్డిని టీకాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్...

Hyderabad: అవినీతి మరక లేని వ్యక్తి జైపాల్‌రెడ్డి : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణ వైతాళికుడు అంటూ కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి సేవలను గుర్తు చేసుకున్నారు టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి. బుధవారం నగరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రేవంత్ మాట్లాడుతూ.. అవినీతి మచ్చ లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది జైపాల్‌రెడ్డేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేని వ్యక్తిత్వమని, తెలంగాణ ఏర్పాటు కోసం సోనియా, మన్మోహన్‌ను ఒప్పించారని రేవంత్ గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు తయారు చేయడంలో కీలకంగా వ్యవహరించారని రేవంత్ రెడ్డి కొనియాడారు.

Updated Date - 2021-07-28T17:51:06+05:30 IST