ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ Tulasi reddy

ABN , First Publish Date - 2022-02-08T16:25:25+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ Tulasi reddy

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కరోనా వ్యాప్తిపై ప్రధాని వ్యాఖ్యలు ఆడలేక మద్దెల వోడు అన్నట్లుగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌పై పీఎం మోదీ చేసిన కామెంట్లు ఆంజనేయుని ముందు పిల్ల కోతి కుప్పి గంతులు వేసినట్లున్నాయన్నారు.  2004-2009 సార్వత్రిక ఎన్నికల్లో వాజపేయి, అద్వానిల నేతృత్వంలోని బీజేపీని ఓడించినట్లే...  2024లో మోడీ, అమిత్ షాలా నేతృత్వంలోని బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి రావడం తథ్యమని తులసిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-08T16:25:25+05:30 IST