చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి

ABN , First Publish Date - 2021-09-17T05:53:12+05:30 IST

చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి

చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలి
మేడ్చల్‌ : కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్న గిరిజన నేతలు

మేడ్చల్‌/బొంరాస్‌పేట్‌ : నగరంలో హత్యాచారానికి గురైన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద బంజారా సేవా సంఘ్‌ గురువారం రాత్రి గిరిజన నేతల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. జాతీయ కోశాధికారి, ప్రజాకవి భట్టు వెంకన్న, భట్టు నాగేశ్వర్‌రావు, ధన్‌రాజ్‌నాయక్‌ల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే రాష్ట్రంలో ఈ పరిస్థితి నెలకొందని గిరిజన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన నేతలు కిషన్‌నాయక్‌, రాజు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బొంరాస్‌పేట్‌ మండల కేంద్రంలో తహసీల్దార్‌ షాహేదాబేగంకు వినతి పత్రం అందించారు. కార్యక్రమంలో దేశ్యనాయక్‌, శంకర్‌నాయక్‌, హరినాయక్‌, నర్సిములు, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-09-17T05:53:12+05:30 IST