శాంతి భద్రతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

ABN , First Publish Date - 2022-06-26T03:43:22+05:30 IST

శాంతి భద్రతల విషంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఎస్పీతో పాటు పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

శాంతి భద్రతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి
వీసీలో పాల్గొన్న ఎస్పీ, పోలీసు సిబ్బంది

- వీసీలో డీజీపీ మహేందర్‌రెడ్డి

ఆసిఫాబాద్‌, జూన్‌ 25: శాంతి భద్రతల విషంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి ఎస్పీతో పాటు పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలు, నకిలీ పత్తి విత్తనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. పోలీసు స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల గౌరవంగా వ్యవ హరించి సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్క రించే దిశగా కృషి చేయాలన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కన్నా ఆసిఫాబాద్‌ జిల్లాలో సీసీ కెమెరాల ఏర్పాటు వాటినిర్వహణ పనితీరు మెరుగుపడుతుంద న్నారు. కేసులు పరిష్కరించడంలో జిల్లా పోలీసు ఉత్తమప్రతిభ కబర్చినందుకు ఎస్పీ సురేష్‌కుమార్‌ను డీజీపీ అభినందించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎస్పీ సురేష్‌కుమార్‌, ఏఎస్పీ(అడ్మీన్‌) అచ్చేశ్వర్‌రావు, ఏఆర్‌ భీంరావు, ఐటీ కోర్‌, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-26T03:43:22+05:30 IST