అగ్రవర్ణ పేద మహిళలకు నేడు ఈబీసీ నేస్తం

ABN , First Publish Date - 2022-01-25T05:29:19+05:30 IST

రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కింద మంగళవారం నిధులు విడుదల కానున్నాయి.

అగ్రవర్ణ పేద మహిళలకు నేడు ఈబీసీ నేస్తం

 27,517 మందికి రూ.41.27 కోట్లు


నెల్లూరు (వీఆర్సీ) జనవరి 24 : రాష్ట్రంలోని అగ్రవర్ణ పేద మహిళలకు ఈబీసీ నేస్తం కింద మంగళవారం నిధులు విడుదల కానున్నాయి.  జిల్లాలోని 27,517 మంది అర్హులైన 45- 60 సంవత్సరాల వయసు కలిగిన అగ్రవర్ణ పేద మహిళలను గుర్తించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మంగళవారం సీఎం కార్యలయం నుంచి స్విచ్‌ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు కులాలకు చెందిన వారు కాకుండా అగ్రవర్ణ పేద మహిళలకు రూ.41.27 కోట్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలో జమ కానున్నాయని బీసీ కార్పొరేషన్‌ ఈడీ వీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-01-25T05:29:19+05:30 IST