పేదలందరికీ ఇళ్ల నిర్మాణం : ప్రసన్న
ABN , First Publish Date - 2021-06-21T03:15:55+05:30 IST
పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రె డ్డి ప్రకటించారు. ఆదివారం ఇందుకూరుపేటలో
ఇందుకూరుపేట, జూన్ 20 : పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రె డ్డి ప్రకటించారు. ఆదివారం ఇందుకూరుపేటలో 40 ఇళ్లకు భూమి పూజ చేసి గృహనిర్మాణ పనులు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లోకేష్ తన స్థాయిని మరచి సీఎంపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కో ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు మావులూరు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ గొల్లపల్లి విజయకుమార్, దువ్వూరు కళ్యాణరెడ్డి, గునపాటి సురేష్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
కొమరికలో..
మండలంలోని కొమరికలో ఆదివారం జగనన్న కాలనీకు శంకుస్థాపన జరిగింది. ఇళ్ల నిర్మాఱానికి లబ్ధిదారులచే శంకుస్థాపన చేయించి పనులు ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ నాయకుడు గూడూరు శివకుమార్రెడ్డి, ఇంజనీరింగు సహాయకులు విజయ్, పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ కొండవీటి సురేంద్ర, చేవూరి మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.