పెదఉల్లగల్లు ఉప సర్పంచ్ మృతి
ABN , First Publish Date - 2021-04-21T06:05:23+05:30 IST
మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ ఉపసర్పంచ్ మేడగం కాంతమ్మ(75) మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు.
ముండ్లమూరు, ఏప్రిల్ 20 : మండలంలోని పెదఉల్లగల్లు పంచాయతీ ఉపసర్పంచ్ మేడగం కాంతమ్మ(75) మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం రాత్రి మృతి చెందారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండో వార్డు నుంచి ఏకగ్రీవమై ఉపసర్పంచ్గా ఎన్నికయ్యారు. ఉపసర్పంచ్ కాంతమ్మ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి కాంతమ్మ కుమారుడు వెంకట రమణారెడ్డిని ఫోన్లో పరామర్శించారు. మాజీ సర్పంచ్ గొంది వెంకటప్పారెడ్డి, మాజీ ఎంపీటీసీ గుణపాటి వెంకటేశ్వరరెడ్డి, తదితరులు నివాళ్లు అర్పించారు.