పెద్ధపల్లి జిల్లాకు చేరుకున్న గజ ఈత గాళ్ళు
ABN , First Publish Date - 2021-02-28T15:33:57+05:30 IST
వామన్రావు దంపతుల హత్యకి ఉపయోగించిన కత్తులు, నిందితుల సెల్ ఫోన్లను..
పెద్ధపల్లి జిల్లా: న్యాయవాది వామన్రావు దంపతుల హత్యకి ఉపయోగించిన కత్తులు, నిందితుల సెల్ ఫోన్లను సుందిళ్ళ బ్యారేజ్లో పడేశారు. వాటిని రికవరీ చేయడానికి పోలీసులు వైజాగ్ నుంచి గజ ఈతగాళ్లను రప్పించారు. దీంతో గజ ఈత గాళ్లు పెద్దపల్లికి చేరుకున్నారు. పోలీసుల కస్టడీలో ఉన్న కుంట శ్రీను, చిరంజీవి, కుమార్లను ఎవరి కంట పడకుండా బ్యారేజ్ వద్దకి తీసుకువెళ్లి విచారించారు. ఆయుధాలు పడవేసిన ప్రాంతాన్ని నిందితులు పోలీసులకు చూపించారు. అయితే ఆయుధాలు బ్యారేజ్లో పడవేసి 10 రోజులవుతుండడంతో అడుగంటి ఉండే అవకాశముంది. కాగా ఆయుధాలు వెలికి తీయడం పెద్ద కష్టమేమీ కాదని పోలీసులు చెబుతున్నారు.