టీడీపీ పూర్వ వైభవానికి కార్యకర్తల కృషి
ABN , First Publish Date - 2022-08-10T05:28:11+05:30 IST
పెద్దాపురం, ఆగస్టు 9: టీడీపీ పూర్వ వైభవానికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని తిరుపతి గ్రామ ంలో మంగళవారం సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి ఆధ్వర్యాన నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం నియోజకవ
పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప
పెద్దాపురం, ఆగస్టు 9: టీడీపీ పూర్వ వైభవానికి ప్రతీ కార్యకర్త కృషిచేయాలని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని తిరుపతి గ్రామ ంలో మంగళవారం సర్పంచ్ మొయిళ్ల కృష్ణమూర్తి ఆధ్వర్యాన నిర్వహించిన క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని 10 క్లస్టర్లుగా విభజించామని, వాటికి ఇన్చార్జ్లను నియమించామన్నారు. ప్రతీ ఇన్చార్జ్ రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి చేపట్టాల్సిన వ్యూహాలను రూపొందించి బూత్లెవెల్లో చైతన్యవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ పటిష్ట నిర్మాణానికి ప్రతీ కార్యకర్త అహర్నిశలూ శ్రమించాలన్నారు. ఇప్పటికే బాదుడే బాదుడే కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లగలిగామన్నారు. కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షుడు కొత్తిం వెంకట శ్రీనివాసరావు (కోటి), మున్సిపల్ మాజీ చైర్మన్ రాజాసూరిబాబురాజు, అన్నవరం ధర్మకర్తల మండలి మాజీ సభ్యుడు కందుల విశ్వేశ్వరరావు, తెలుగుయువత మండలాధ్యక్షుడు నూనే రామారావు చౌదరి, గోరింట ఎంపీటీసీ సభ్యుడు పచ్చిపాల సతీష్ పాల్గొన్నారు.