టీడీపీ విజయాన్ని ఆపలేరు: రాజప్ప
ABN , First Publish Date - 2021-03-02T05:56:00+05:30 IST
పెద్దాపురం, మార్చి 1: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అపలేరని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో టీడీపీ అభ్యర్థుల తరుపున ఆయన కాకినాడ పార్లమెంట్ నియోకవర్గ ఇన్చార్జ్ జ్యోతుల నవీన్తో కలిసి సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టా
పెద్దాపురం, మార్చి 1: మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అపలేరని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. పట్టణంలో టీడీపీ అభ్యర్థుల తరుపున ఆయన కాకినాడ పార్లమెంట్ నియోకవర్గ ఇన్చార్జ్ జ్యోతుల నవీన్తో కలిసి సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా వార్డుల్లో తిరిగి తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అ నంతరం వారు మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేశామన్నారు. వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న అస్తవ్యస్త విధానాలతో ప్రజలు విసిగిపోయారని, అభివృద్ధి చేసేవారికే పట్టం కడతారన్నారు. టీడీపీపై ప్రజలకు నమ్మకం ఉందని, ఆ నమ్మకమే తమ విజయానికి దోహదపడుతుందని తెలిపారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహఖ కార్యదర్శి రాజాసూరిబాబురాజు, రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, ఏరియా ఆసుపత్రి మాజీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, మాహారాణీ సత్రం మాజీ చైర్మన్ తూతిక రాజు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొరిపూరి రాజు పాల్గొన్నారు.