పెద్దాపురంలో కొట్లాట.. విద్యార్థి మృతి

ABN , First Publish Date - 2022-04-27T02:15:07+05:30 IST

జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురంలో విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు.

పెద్దాపురంలో కొట్లాట.. విద్యార్థి మృతి

కాకినాడ: జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెద్దాపురంలో విద్యార్థుల మధ్య కొట్లాట జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి మృతిచెందాడు. మృతి చెందిన విద్యార్థి జి. మేడపాడు హైస్కూలులో 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడిది సామర్లకోట మండలం జి.కొత్తూరు గ్రామం.క్రికెట్ బ్యాట్‌తో కొట్టడంతోనే బాలుడు మృతిచెందినట్లు అనుమానాలున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుతున్నారు. 

Updated Date - 2022-04-27T02:15:07+05:30 IST