పెద్దిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే: పట్టాభి

ABN , First Publish Date - 2021-09-06T23:02:06+05:30 IST

రోడ్లు దుస్థితిపై ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

పెద్దిరెడ్డి చెప్పినవన్నీ అబద్ధాలే: పట్టాభి

హైదరాబాద్: రోడ్లు దుస్థితిపై ప్రభుత్వంపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మండిపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రోడ్ల నిర్మాణాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆటకెక్కించిందని దుయ్యబట్టారు. రోడ్లపై వరి నాట్లు వేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రోడ్ల కోసం వివిధ బ్యాంకుల నుండి వస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ గాల్లో తిరగకుండా రోడ్డుపై తిరిగితే రోడ్ల పరిస్థితి తెలుస్తుందన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రోడ్లపై చెప్పినవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు. రూ. 15 కోట్లు మాత్రమే వైసీపీ ప్రభుత్వం రోడ్ల కోసం ఖర్చు చేసిందని పట్టాభి తెలిపారు.

Updated Date - 2021-09-06T23:02:06+05:30 IST