రౌడీషీటర్‌పై మరోసారి పీడీయాక్ట్‌

ABN , First Publish Date - 2020-08-07T06:57:55+05:30 IST

బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పోలీసులు గురువారం మరోసారి పీడీయాక్ట్‌ నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు

రౌడీషీటర్‌పై మరోసారి పీడీయాక్ట్‌

గతంలోనూ వరంగల్‌ సెంట్రల్‌ జైలులో ఏడాది శిక్ష


నల్లగొండ క్రైం, ఆగస్టు 6: బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న రౌడీషీటర్‌పై పోలీసులు గురువారం మరోసారి పీడీయాక్ట్‌ నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. నల్లగొండ వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో మహ్మద్‌       మోసిన్‌ఖాన్‌ అలియాస్‌ మోసిన్‌పై ఒక హత్య కేసు, రెండు హత్యాయత్నం కేసులతో పాటు పలువురిని బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడిన ఆరుకేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.


సుమారు ఐదు సంవత్సరాల నుంచి వన్‌టౌన్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌గా రికార్డుల్లో ఉన్న మోసిన్‌పై 2018లో కూడా పీడీ యాక్ట్‌ నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించారు. అక్కడ ఏడాదిపాటు పాటు జైలుశిక్ష అనుభవించి తిరిగి నల్లగొండకు వచ్చాడు. అయినా తన నేర స్వభావాన్ని మార్చుకోకుండా మరోసారి ముగ్గురు వ్యక్తులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఎస్పీ ఏవీ.రంగనాథ్‌ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో పీడీయాక్ట్‌ నమోదు చేసి వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు తరలించినట్లు సీఐ నిగిడాల  సురే్‌షకుమార్‌ తెలిపారు.  

Updated Date - 2020-08-07T06:57:55+05:30 IST