టీడీపీకి ఓటేశారంటూ.. పింఛను ఆపారు

ABN , First Publish Date - 2021-03-03T07:13:44+05:30 IST

శంఖవరం, మార్చి2: అధికార పార్టీకి ఓట్లేయలేదంటూ తమకు పింఛన్లు నిలిపివేశారంటూ పింఛనుదారులైన వృ ద్ధులు, వితంతవులు నిరసన వ్యక్తంచేశారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండపం గ్రామంలో టీడీపీ ఓటేశారనే నెపంతో 30 మందికి పైగా పింఛన్లు నిలిపివేశారని బాధి తులు ఆరోపించారు

టీడీపీకి ఓటేశారంటూ.. పింఛను ఆపారు
మండపం గ్రామంలో ఆందోళన వ్యక్తం చేస్తున్న పింఛనుదారులు

మండపం పింఛనుదారులు

శంఖవరం, మార్చి2: అధికార పార్టీకి ఓట్లేయలేదంటూ తమకు పింఛన్లు నిలిపివేశారంటూ పింఛనుదారులైన వృ ద్ధులు, వితంతవులు నిరసన వ్యక్తంచేశారు. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండపం గ్రామంలో టీడీపీ ఓటేశారనే నెపంతో 30 మందికి పైగా పింఛన్లు నిలిపివేశారని బాధి తులు ఆరోపించారు. పింఛన్ల కోసం సచివాలయం చుట్టూ తిరుగుతున్నామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మీరు టీడీపీకి ఓటేశారు, ఇక మీకు పింఛనురాదని అధికార పార్టీ నాయకులు అంటున్నారని వారు వాపోయారు. పింఛన్ల తోనే జీవనం సాగిస్తున్నామని, పింఛను రాక ఇబ్బందులు పడుతున్నామని దివ్యాంగ మహిళ ఒకరు ఆవేదన వ్యక్తం చేసింది. అయితే కేవలం సాంకేతిక లోపంతోనే 33 మందికి పింఛన్లు ఇవ్వలేకపోయామని, బుధవారం పూర్తి స్ధాయిలో పింఛన్లు ఇస్తామని ఎంపీడీవో జె రాంబాబు తెలిపారు.

Updated Date - 2021-03-03T07:13:44+05:30 IST