మైలవరం నుంచి పెన్నాకు నీరు విడుదల
ABN , First Publish Date - 2020-11-27T06:05:26+05:30 IST
మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఏఈ గౌతమ్రెడ్డి తెలిపారు.
మైలవరం, నవంబరు 26 : మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి 1200 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు జలాశయం ఏఈ గౌతమ్రెడ్డి తెలిపారు. నివర్ తుపాన్ ప్రభావంతో గురువారంఉదయం నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా మైలవరం జలాశయానికి నీరు వచ్చి చేరుతుండటంతో వచ్చిననీటినంతటిని పెన్నాకు వదులుతున్నట్లు ఏఈ తెలిపారు. మైలవరానికి మరింత నీరు వచ్చి చేరితే వచ్చే నీటిని పెన్నాకు విడుదల చేస్తామని ఏఈ తెలిపారు. పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.