మహానాడులో పెనుకొండ నాయకులు

ABN , First Publish Date - 2022-05-28T06:27:06+05:30 IST

ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు పెనుకొండ నియోజకవర్గం నుంచి దేశం నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు.

మహానాడులో పెనుకొండ నాయకులు
ఒంగోలు మహానాడులో పాల్గొన్న రొద్దం మండల యువ నాయకులు

చంద్రబాబును సత్కరించిన సవిత


పెనుకొండ, మే 27: ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడుకు పెనుకొండ నియోజకవర్గం నుంచి దేశం నాయకులు భారీ ఎత్తున తరలివెళ్లారు. శుక్రవారం మహానాడు సభావేదిక ప్రాంగణానికి చేరుకున్న హిందూపురం పార్లమెంట్‌ అధ్యక్షుడు బీకే పార్థసారథి, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సవిత, తె లుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జీవీపీ నాయుడు, హిందూపురం కార్యనిర్వాహక కార్యదర్శి మునిమడుగు వెంకటరాముడు, కురుబ కృష్ణమూర్తి, తెలుగు మహిళ అధ్యక్షురాలు సుబ్బరత్నమ్మ, రొద్దం నరసింహులు, మాధవనాయుడు, త్రివేంద్రనాయుడు తదితరులకు సాంస్కృ తిక విభాగం కళాకారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం స భావేదిక మీద ఉన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును రాష్ట్ర కా ర్యనిర్వాహక కార్యదర్శి సవిత కలిసి పుష్పగుచ్ఛాన్ని అందించి శాలువా తో సత్కరించారు. 


రొళ్ల: మండలంలోని అన్ని గ్రామాల నుంచి టీడీపీ నాయకులు, కా ర్యకర్తలు పెద్దఎత్తున మహానాడుకు శుక్రవారం భారీగా తరలివెళ్లారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒంగోలులో జరిగే పసుపుపండుగకు ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. వారిలో కన్వీనర్‌ దాశిరెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ సిద్దగంగప్ప, మాజీ ఎంపీటీసీ గంగన్న, మూర్తి, రామకృష్ణ, వెంకటేష్‌, దాసప్ప ఉన్నారు. 


రొద్దం: ఒంగోలులో జరిగిన మహానాడుకు మండల యువ నాయకు లు హాజరయ్యారు. రొద్దం నుంచి తరలి వెళ్లిన యువనాయకులు శుక్రవారం మహానాడులో పాల్గొని వీక్షించారు. పార్టీ అధినాయకుల సందే శాలతో ఉత్సాహం నింపుకున్నారు. యువ నాయకులు పార్లమెంట్‌ తెలు గు యువత ఉపాధ్యక్షులు ఈడిగ హరి, నాగరాజు, గోనిమేకలపల్లి అశ్వర్థ, ఇమాంసాబ్‌, రొద్దకంపల్లి నాగరాజు, రుద్రప్రసాద్‌, సో ము, సురేష్‌, చెరుకూరు అంజి, వెంకి, హనుమప్ప పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-28T06:27:06+05:30 IST